క్రైమ్/లీగల్

ఆటో బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 17: నాంపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం ఓ ఆటో బోల్తా కొట్టింది. స్కూల్ పిల్లలతో వెళుతున్న ఆటో అదుపు తప్పి పడిపోవడంతో అందులో ఉన్న నలుగురు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడగా, ఇద్దరు పిల్లకు గాయాలయ్యాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులను పాతబస్తీ మొగల్‌పురాకు చెందిన సయ్యద్ అక్బర్ తన ఆటోలో ఖైరతాబాద్ నుంచి ప్రతి రోజు స్కూల్‌కు తీసుకువెళ్లి, తీసుకువస్తుంటాడు. రోజులాగే మంగళవారం తన ఆటోలో విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు తీసుకువెళుతుండగా, నాంపల్లిలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆటోబోల్తా పడింది. ఈ ఘటనలో రెండవ తరగతి చదువుతున్న రుత్విక్ (6), ఐదో తరగతి చదువుతున్న మయాంక్ అగర్వాల్ (10)కి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. రుత్విక్ తండ్రి సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటోడ్రైవర్ అక్బర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ద్విచక్ర వాహనదారుడు వేగంగా దూసుకురావడంతో అతన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైనట్టు చెప్పాడు. ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించనున్నారు.