క్రైమ్/లీగల్

సత్తుపల్లి పట్టణవాసి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఏప్రిల్ 14: సత్తుపల్లి పట్టణం మసీద్ రోడ్డుకు చెందిన షేక్ మాబూసుభానీ (37) మంగళవారం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామ శివారుల్లో రక్తపు మరకలు కనిపించాయంటూ ఒక అజ్ఞాతవాసి సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు సత్తుపల్లి పోలీసులు కనిపించకుండా పోయిన మాబూను హత్య చేశారని భావించి కొందరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులు ఎటువంటి సమాచారం తెలపకపోవడంతో శనివారం పోలీసు జాగిలాలను తెప్పించి రుద్రాక్షపల్లి గ్రామ శివారులో జాగిలాలను రక్తపు మరకల వద్ద వదిలారు. జాగిలాలు రక్తపు మరకల సమీప దూరంలో పంటపొలాల్లో మాబూ మృతదేహాన్ని కనుగొన్నాయి. మృతదేహాన్ని కొట్టిచంపి కాల్చివేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తప్పిపోయిన మాబూసుబాని మృతదేహంగా గుర్తించటంతో పట్టణంలోని మసీదురోడ్‌లోని ఆయన నివాస గృహంవద్ద విషాద చాయలు అలముకున్నాయి. సంఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి విచారణ జరిపిస్తున్నారు. సత్తుపల్లి సీఐ వెంకట నర్సయ్య కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు.