క్రైమ్/లీగల్

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం ఖిల్లా, ఏప్రిల్ 14: బోనకల్ మండలంలో మోటమర్రి రైల్వేస్టెషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి విజయవాడ నుండి వరంగల్ వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు చొరబడి దోపిడీయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మోటమర్రి రైల్వేస్టేషన్ దాటుతున్న సమయంలో ఆరుగురు దొంగల ముఠా సభ్యులు రైల్లో ప్రయాణీకులను భయపెట్టి బంగారు ఆభరణాలు దొంగిలించే ప్రయత్నం చేశారు. మహిళా ప్రయాణికులు ప్రతిఘటించి కేకలు వేయడంతో రైల్వే కోస్ట్‌గార్డు కానిస్టేబుల్ దోపిడీ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్‌ను గాయపరిచి చైన్‌లాగి పారిపోయారు. గత కొనే్నళ్ళుగా మోటమర్రి రైల్వేస్టేషన్ సమీపంలో పదుల సంఖ్యలో దొంగలు దోపిడీలకు పాల్పడ్డారు. దొంగలు పారిపోవడానికి అనుకూల ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. రాత్రి వేళల్లో ప్రయాణికులు నిద్రపోతున్న సమయాన్ని దొంగలు అదునుగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. రైళ్ళలో పోలీసుల నిఘా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.