క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఏప్రిల్ 14: గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. పీక తెగకోసి అతికిరాతకంగా హత్య చేసారు. అక్రమ సంబంధం కారణంగా జరిగిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలియకపోవడంతో ఆధార్ ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి అప్పన్నదొరపాలెం సమీపంలోని జీడి తోటలో శనివారం ఉదయం గుర్తు తెలియన మహిళ మృత దేహం పడి ఉంది. హత్యకు గురైన మహిళ పీకపై కత్తితో నరికినట్లుగా గాయాలను బట్టి తెలుస్తోంది. హత్యకు వినియోగించిన కత్తితో పాటు టవల్ మృత దేహం సమీపంలో పడి ఉన్నాయి. వయస్సు 35 సంవత్సరాలు ఉండవచ్చని, పచ్చరంగు జాకెట్ వేసుకుని సన్నగా ఉంది. సంఘటన జరిగిన తీరును పరిశీలిస్తే అక్రమ సంబంధం నేపధ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హతురాలి చేతిలో తలవెంట్రుకలు ఉండటాన్ని బట్టి ఇద్దరి మధ్య పెనుగులాట జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృత దేహాన్ని చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎ ఎస్పీ అరీఫ్ హఫీజ్ , రూరల్ సి. ఐ. రేవతమ్మలు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృత దేహాన్ని పరిశీలించారు. ఆధార్‌తో హతురాలి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తామని ఎ ఎస్పీ విలేకరులకు తెలిపారు. ఈసంఘటన శుక్రవారం రాత్రి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.