క్రైమ్/లీగల్

520 రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి రూరల్, ఏప్రిల్ 15: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రూరల్ పోలీసులు ఆదివారం టోల్‌ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్నారు. రూరల్ ఎస్సై పుల్లారావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు లారీలో బోగస్ బిల్లుతో తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లారీని పరిశీలించగా 520 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ లారీ డ్రైవర్ బసవలింగయ్య, క్లీనర్ ఇజ్రాయిల్‌లను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తెలిపారు.