క్రైమ్/లీగల్

క్రికెట్ బుకీల అరెస్టు రూ. 20.9 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, ఏప్రిల్ 15: అనంతపురం నగరంలో శనివారం ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఆదివారం డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో నగరంలోని ఓ లాడ్జిలో ఈ నెల 14వ తేదీ బెట్టింగ్‌కు పాల్పడుతుండగా పోలీసులు దాడులు చేసి ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశారన్నారు. అలాగే వారి నుంచి రూ. 20.9 లక్షల నగదు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతపురం కేంద్రంగా బెడదూరి శివ రామాంజులరెడ్డి అలియాస్ శివారెడ్డి, హైదరాబాద్ కేంద్రంగా గుమ్మడి రామాంజినేయులు అలియాస్ రామాంజి, నాగరాజు అలియాస్ రాజా, బెంగళూరు కేంద్రంగా మంగళ ప్రసాద్ అలియాస్ కత్తి ప్రసాద్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్లుగా గతంలో వీరిపై కేసులు నమోదయ్యాయన్నారు. ఐపీఎల్ సందర్భంగా వీరు మళ్లీ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారన్నారు. వారితో పాటు దేవేంద్రనాయక్, యతిరాజుల ప్రసాద్, వడ్డే బాలకృష్ణలను అదుపులోకి తీసుకున్నారన్నారు.