క్రైమ్/లీగల్

మన్నూరు ఎస్సై భార్య ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట రూరల్, ఏప్రిల్ 16:మన్నూరు పోలీస్‌స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న ఎస్సై మహేష్‌నాయుడు సతీమణి సౌజన్య (24) సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొంది. వివరాలిలావున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంకు చెందిన మహేష్‌నాయుడుకు నాలుగేళ్ల క్రితం నెల్లూరు కావలికి చెందిన సౌజన్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు కలడు. సోమవారం సాయంత్రం కుమారునితో బైక్‌పైవెళ్లి గంట తర్వాత ఇంటికి వచ్చిన మహేష్‌నాయుడు ఇంట్లో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలియడంతో కుప్పకూలిపోయాడు. పట్టణంలోని నూనెవారిపల్లె రోడ్‌లో నివాసం ఉంటున్న ఎస్సై ఇటీవలే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఇంటికి మారాడు. మనస్పర్థలతో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నందలూరు, పుల్లంపేట, రాజంపేట పోలీస్‌స్టేషన్‌లకు చెందిన ఎస్సైలు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి శోకసముద్రంలో మునిగిన మహేష్‌నాయుడును ఓదార్చారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం రేకెత్తించడంతో స్థానికులు పెద్దపెట్టున ఎస్సై ఇంటి వద్ద గుమిగూడారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.