క్రైమ్/లీగల్

విశాఖలో ముగ్గురు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), అక్టోబర్ 11: విశాఖలో దారుణం జరిగింది. అర్ధరాత్రి వేళ ఒక ఇంట్లో అగ్నికీలలు చుట్టుముట్టగా ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఘటనకు సంబంధించి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ సమీపంలోని సాగర్‌నగర్‌లో సీహెచ్ ఉమామహేశ్వర రావు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి యధావిధిగా వీరు ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తరువాత ఉమామహేశ్వర రావు ఇంట్లోంచి దట్టమైన పొగలు వస్తూ అగ్ని కీలలు చెలరేగడాన్ని స్థానికులు గుర్తించారు. తక్షణమే రక్షించే ప్రయత్నం చేయగా, ఇంట్లో ఉమామహేశ్వర రావు కుమారుడు శరత్‌చంద్ర (38), లావణ్య (32) సజీవదహనమయ్యారు. అగ్ని కీలల్లో చిక్కుకున్న ఉమామహేశ్వర రావు (60) కూడా కొన ఊపిరితో ఉండగా రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ వల్లే ప్రమాదం సంభవించినట్టు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం వీరంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.