క్రైమ్/లీగల్

విలేఖరి హత్య.. తుని ఎమ్మెల్యేపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, అక్టోబర్ 17: తూర్పు గోదావరి జిల్లాలో ఒక దినపత్రిక విలేఖరి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పేరు అనుమానితునిగా పోలీసులు నమోదుచేశారు. ఒక దినపత్రికకు తొండంగి మండల అర్బన్ విలేఖరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణను మంగళవారం రాత్రి దారుణంగా హత్యచేసిన సంగతి విదితమే. మృతుడు సత్తిబాబు సోదరుడు కె గోపాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదుచేశామని పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తొండంగి మండలానికి చెందిన గాబు రాజు, మురాలశెట్టి నాగవెంకటరమణ, మాకినీడి బుజ్జి, పెద్దిరెడ్డి సురేష్, గాబు గణేష్‌తోపాటు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపేరును అనుమానితునిగా నమోదు చేసినట్లు తెలిపారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తుచేసి, దోషులను అరెస్టు చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.