క్రైమ్/లీగల్
రూ.11.50 లక్షల నగదు పట్టివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 October 2019
నేరేడుచర్ల, అక్టోబర్ 18: హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి చెక్పోస్టు వద్ద శుక్రవారం ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న రూ.11.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గురజాలకు చెందిన దివ్వల సాంబశివరావు బంగారం ఆభరణాల వ్యాపారి వద్ద రూ.4 లక్షలు, వాడపల్లికి చెందిన పోస్టల్ ఏజెంట్ వద్ద రూ.7.50 లక్షలు పట్టుకుని ఇరువురూ ఇన్నోవా వాహనంలో గురజాల నుంచి సూర్యాపేటకు తరలిస్తుండగా తనిఖీలో భాగంగా సోదా చేయగా గుర్తించి పట్టుకున్నట్టు, ఈ నగదును హుజూర్నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పజెప్తున్నట్టు తనిఖీ సిబ్బంది తెలిపారు.