క్రైమ్/లీగల్
నలుగురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 October 2019
పెనుకొండ, అక్టోబర్ 20 : కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఓ కన్న తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. పెనుకొండ మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఆదివారం రాత్రి హరిజన వెంకటేష్ మద్యం మత్తులో భార్య కళావతిని చితకబాదాడు. దీనికి తోడు వెంకటేష్ కుటుంబ పోషణ పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించేవాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కళావతి జీవితంపై విరక్తి చెంది శీతల పానీయంలో పురుగుల మందు కలిపి కుమార్తెలు అంజలి, వైష్ణవి, కుమారులు రాజేష్, రమేష్లకు తాపి అనంతరం తాను తాగింది. దీంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.