క్రైమ్/లీగల్
బేగంపేటలో దారుణ హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బేగంపేట, అక్టోబర్ 22: ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇందిరమ్మనగర్ రసూల్పురాలో నివాసముంటే సయ్యద్ నజీర్(32) సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుఝము ఐదు గంటల ప్రాంతంలో రసూల్పురా విమాన్నగర్లో నజీర్ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసం, పొట్టలో కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ విషయాన్ని పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు గమనించారు. పాతకక్షల నేపథ్యంలోనే నజీర్ను హత్య చేసి ఉంటారి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బేగంపేట ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర రావు, ఎస్ఐలు సాయినాథ్ రెడ్డి, సుదర్శన్ యాదవ్ ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు సయ్యద్ జావెద్ అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.