క్రైమ్/లీగల్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 April 2018
పరకాల, ఏప్రిల్ 16: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరకాల మండలం వరికోల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన దొగ్గెల కుమారస్వామి (45) అనే రైతు తనకున్న రెండు ఎకరాల భూమిలో పంట వేయగా పంట దిగుబడి రాక తెచ్చిన అప్పులు ఏలా తీర్చాలనే మనోవేదనకు గురై ఆదివారం సాయంత్రం పరకాలకు వచ్చి పురుగుల మందు తాగినాడని చెప్పారు. గమనించిన వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారని చెప్పారు. మృతుని భార్య సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలపారు.