క్రైమ్/లీగల్

అదుపు తప్పి కాలువలో పడిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, అక్టోబర్ 26: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామ సమీపంలోని కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి కారు దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఎదులపురం శశాంత్ (25), కొమురవెల్లి సాయి సంగీత్ (26) ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రానికి చెందిన సాయి సంగీత్, శశాంత్‌లు ఏపీ 01 క్యూ 0418 నంబర్ గల ఆల్ట్రో కారులో శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం నుండి రేవోజిపేట గ్రామానికి ప్రధాన కాలువ రోడ్డుపై నుండి రావడం జరిగింది. ఈ సమయంలో ప్రధాన కాలువ దారి నుండి కారును గ్రామంలోకి వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి కాలువ నీటిలో దూసుకుపోయింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని చూసిన గ్రామస్థులు సమాచారం అందించడంతో పోలీసులు, గ్రామస్థులు అక్కడికి చేరుకొని గల్లంతైన యువకుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ మృతదేహాలు లభించలేదు.