క్రైమ్/లీగల్

నంద్యాలలో రూ. కోటి బంగారం అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ. కోటి విలువైన బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. మెయిన్‌బజార్‌లోని శ్రీనిమిషాంబ బంగారు ఆభరణాల దుకాణం పైభాగంలోని తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు బీరువా తెరచి అందులోని బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని వెంకన్న వర్మ చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుకాణంలోని 3 కిలోల బంగారు ఆభరణాలు, వెండి నగలు, రూ.5 లక్షల నగదు కూడా దోచుకున్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.