క్రైమ్/లీగల్

దంపతుల ఆత్మహత్య యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, నవంబర్ 7: చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని ఆనాసం పల్లి గ్రామంలో భార్యభర్తలు ఆత్మహత్య యత్నానికి పాల్పడగా భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా మారిన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు అనాసం పల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ తోలుతూ జీవిస్తున్న మోహన్ రెడ్డి (48), భార్య వరలక్ష్మి (43) కూతురు జోత్స్న, కుమారుడు రాజేష్‌లతో జీవనం సాగిస్తున్నారు.
ఊర్లో అందరినీ అప్యాయంగా పలుకరిస్తూ నిన్నటి వరకు కళ్లముందు తిరిగిన వరలక్ష్మి, మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గుర్తించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. వారిని వెంటనే తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మోహన్ రెడ్డి మృతి చెందాడు. భార్య వరలక్ష్మి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఆత్మహత్యకు దారితీసిన కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మోహన్ రెడ్డి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్త ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.