క్రైమ్/లీగల్

ఏనుగుల దాడిలో గిరిజనుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెళియాపుట్టి, ఏప్రిల్ 17: మండలంలో పరశురాంపురం పంచాయతీ పరిధిలో గల పెద్దమడి గ్రామానికి చెందిన సవర రామారావు(40) గత మూడు రోజులు ముందు అదృశ్యమైనట్లు పోలీసులకు ఆయన కుటుంబీకులు ఫిర్యాదు చేసారు. స్థానిక గిరిజనులు పరశురాంపురం అడవుల్లో రామారావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరశురాంపురం కొండల్లో ఏనుగుల దాడిలో రామారావు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. రామారావు ఆవులు మేత కోసం కొండల్లోకి వెళ్లినట్లు, అక్కడ ఏనుగుల దాడిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల హీరాపురం గ్రామానికి చెందిన వృద్దురాలు మహాలక్ష్మి ఏనుగులదాడిలో మృతి చెందిన సంఘటన మరవకముందే అదే పంచాయతీలో మరో గిరిజనుడు మృతి చెందడంపై ఆ ప్రాంతంలో గిరిజనులు ఆందోళన చెందారు. సంఘటన స్థలం వద్దకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ ఐ రాజేష్ తెలిపారు.