క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 17: కాకినాడ-యానాం జాతీయ రహదారిలో తాళ్ళరేవు మండలం పటవల గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తెలు దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు ఢీకొనడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని మధురానగర్‌కు చెందిన దాట్ల శ్రీరామరాజు కుమార్తె దాట్ల లక్ష్మీహిమజ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. చదువులో భాగంగా ఓ విశ్వ విద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసేందుకు కోరంగి సమీపంలోని కైట్ కళాశాలకు వెళ్ళారు. ప్రవేశ పరీక్ష అనంతరం కుమార్తె హిమజను కాకినాడ తీసుకువెళ్ళేందుకు శ్రీరామరాజు వెళ్ళారు. వీరిరువురూ ద్విచక్ర వాహనంపై కాకినాడ వస్తున్నారు. పటవల సమీపంలోకి వచ్చేసరికి ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ యూ టర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో కారు వేగంగా వస్తూ కాకినాడ వెళ్తోన్న శ్రీరామరాజు బైక్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదంలో మరో బైక్‌పై ప్రయాణిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తికి గాయాలు కాగా శ్రీరామరాజు ఆయన కుమార్తె లక్ష్మీహిమజ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కోరంగి పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించారు. కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.