క్రైమ్/లీగల్

ఆటో, లారీ ఢీ.. ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఏప్రిల్ 17:బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లూరు కొత్తపేట సమీపంలో మంగళవారం ఉదయం ఆటో, లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఎస్‌ఐ రాకేశ్ తెలిపిన వివరాలు.. బనగానపల్లె నుంచి కొత్తపేట వైపు వెళ్తున్న ఆటో (కొత్తపేటకు 1కి.మీ దూరంలో) అదుపుతప్పి రోడ్డు కుడివైపుకు వెళ్లడంతో అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో కొత్తపేటకు చెందిన ఎం.చెన్నకేశవ(16), రామచంద్రుడు(32), మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చల్లా శివుడు(14) అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే ప్యాపిలి మండలం బూర్గులకు చెందిన నరసింహులు తీవ్రంగా గాయపడగా బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో చెన్నకేశవ, శివుడు విద్యార్థులు కాగా కొత్తపేట హాస్టల్‌లో వుండి చదువుకుంటున్నారు. తీవ్రంగా గాయపడిన నరసింహులు కొత్తపేటలో బంధువులను చూసేందుకు వెళ్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అలాగే శవాలను పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.