క్రైమ్/లీగల్

అన్నను చంపిన తమ్ముడి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, ఏప్రిల్ 17: మండలంలోని కురంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రాజశేఖర్(25)ను ఈ నెల 11న బండరాయితో కొట్టి హత్య చేసిన రాజశేఖర్ తమ్ముడు వెంకటేశ్‌ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం మృతుడు రాజశేఖర్ మొదటి భార్య అశ్వినికి ఒక కుమార్తె ఉండగా, భర్తతో తగాదా పడి అశ్విని తన పుట్టింటికి వెళ్లింది. అనంతరం రాజశేఖర్‌కు రెండో వివాహం రేణుకతో జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి భార్యకు ఒక ఎకరం, రెండో భార్య రేణుకకు రెండు ఎకరాలను పంపిణీ చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. మొత్తం 13 ఎకరాల్లో తన వంతు భూమి తగ్గుతుందని భావించిన తమ్ముడు వెంకటేశ్ అన్నపై కక్ష పెంచుకొని రాజశేఖర్ తలపై బండరాయితో మోది హతమార్చాడు. పరారీలో ఉన్న వెంకటేశ్‌ను మంగళవారం మండలంలోని మాల్‌లో పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపారు.