క్రైమ్/లీగల్
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 April 2018
రాజాపేట, ఏప్రిల్ 17: అప్పుల బాధతో మండలంలోని దూది వెంకటాపురం గ్రామానికి చెందిన వస్పరి బాలమణి(42) మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. బాలమణి తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో అప్పులు తెచ్చి పత్తి పంట వేయగా దిగుబడి సరిగ్గా రాకపోవడంతో 3లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నారు. బాలమణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీపీ పులి సత్యనారాయణ, జడ్పీటీసీ నాగిర్తి రాజిరెడ్డి, సీపీఐ నాయకులు బిక్షపతిగౌడ్లు డిమాండ్ చేశారు.