క్రైమ్/లీగల్

బాలుడి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, నవంబర్ 17: కన్నతల్లే తన కుమారుడి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. నిర్దాక్షిణ్యంగా ఉరేసి ప్రాణం తీసింది. ఆడుతూ, పాడుతూ ఎంతో ఉల్లాసంగా గడపాల్సిన ఓ చిన్నారి అనుమానాస్పద స్థితిలో శవంగా మారాడు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలో జనె్నపల్లి రాజేష్ (8) అనే బాలుడు ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాల కారణంగా సదరు బాలుడిని అతడి తల్లే మెడ చుట్టూ ఉరి బిగించి హత్య చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జనె్నపల్లి అశోక్, సునీత దంపతులు గత కొన్నాళ్ల నుంచి ధర్మారం(బీ) గ్రామంలో నివసిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు రాజేష్ (8) స్థానికంగా గల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. డ్రైవర్ వృత్తిలో కొనసాగుతున్న అశోక్ రోజువారీలాగే ఆదివారం ఉదయం విధులకు వెళ్లాడు. కొద్దిసేపటి అనంతరం సునీత పెద్దపెట్టున రోదిస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఆమె ఇంటికి వచ్చి చూడగా, చిన్నారి రాజేష్ విగతజీవిగా మారి శవమై కనిపించాడు. అతని మెడ చుట్టూ ఉరి వేసినట్టుగా గాయాల ఆనవాళ్లు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రాజేష్ మృతి విషయమై సునీతను ప్రశ్నిస్తే, ఎలా చనిపోయాడన్నది తనకు తెలియదని, తాను ఇంటి బయట పనులు చేసుకుని వచ్చి చూస్తే శవమై పడి ఉన్నాడని తెలిపింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సురేష్‌లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ కూడా ఘటనా ప్రదేశాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాలుడి తల్లిదండ్రులను పోలీసులు వేర్వేరుగా ప్రశ్నించగా, ఇరువురూ పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబ కలహాల కారణంగా రాజేష్‌ను హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి, అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు జరుపుతున్నామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
*చిత్రం... అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలుడు రాజేష్ (8)