క్రైమ్/లీగల్

బైకును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 17: మితిమీరిన వేగంతో వస్తున్న ఓ ఫార్చ్యూనర్ కారు. . బైకును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎల్లంపేట్ గ్రామానికి చెందిన తోట వెంకటేశ్(35) డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన తన స్నేహితుడు కారింగుల సాయి రాం(22)తో కలిసి ద్విచక్రవాహనం (టీఎస్08ఎఫ్‌ఎస్8384) ఎదో పని మీ ద మేడ్చల్ పట్టణానికి వచ్చారు. తిరిగి బైక్‌పై రాత్రి సొంత గ్రామం బయలు దేరి ఏల్లంపేట్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో 44వ జాతీయ రహదారి ఏల్లంపేట్ పెట్రోల్‌బంకు సమీపంలో వేగంగా వస్తున్న ఫార్చ్యూనర్ కారు (టీఎస్10 ఈఈ 5678) బలంగా ఢీకొట్టింది. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సుచిత్రా ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించగా వెంకటేశ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్‌ఐ తెలిపారు. సాయిరాం కొంపల్లిలోని హర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఇదే ఫార్చ్యూనర్ కారు పట్టణంలోని వివేకానంద విగ్రహం సమీపంలో రోడ్డు దాటుతున్న ఆది శేషయ్య (44)ను ఢీకొట్టిందని అతన్ని చికిత్స నిమిత్తం కొంపల్లిలో ప్రాంతంలోని ఆసుపత్రికి తరిలించి కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేశ్ తెలిపారు.