క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 April 2018
బనగానపల్లె, ఏప్రిల్ 17: కర్నూలు జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. బనగానపల్లె పోలీస్స్టేషన్ పరిధిలోని ఇల్లూరు కొత్తపేట సమీపంలో మంగళవారం ఉదయం ఆటో అదుపుతప్పి కుడివైపు వెళ్లడంతో అదే మార్గంలో వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న కొత్తపేటకు చెందిన ఎం.చెన్నకేశవ(16), రామచంద్రుడు(32), రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చల్లా శివుడు(14) అక్కడికక్కడే మృతి చెందారు. ప్యాపిలి మండలం బూర్గులకు చెందిన నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.