క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 December 2019
బెళుగుప్ప, డిసెంబర్ 10: అనంతపురం జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై కాలవపల్లి సమీపంలో మంగళవారం బొలెరో వాహనం బోల్తా పడడంతో నగరానికి చెందిన బంగారప్ప(55), వెంకటప్ప(44) అక్కడిక్కడే మృతిచెందారు.
తీవ్రంగా గాయపడిన భాస్కర్(24)ను చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం నగరానికి చెందిన వీరంతా కర్నాటకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం బారినపడ్డారు.