క్రైమ్/లీగల్

పెళ్లింట పెను విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఢిల్లీ శివారులోని ఓ పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడి తండ్రి, బంధువులు ప్రయాణిస్తున్న టాటా సుమో వాహనం గుంతలో పడిపోవడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. పెళ్లి కుమారుడి తండ్రి సహా ఆరుగురు మృతిచెందారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు. మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... ఘజియాబాద్ విజయ్‌నగర్‌కు చెందిన ఓంప్రకాష్ రస్తోగి తన కుమారుడి వివాహానికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. వివాహ వేదిక వద్ద ఊరేగింపు జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు ఇంటి దగ్గరనుంచి రస్తోగి సుమో వాహనంలో 11మంది బంధువులతో బయలుదేరాడు. కొంతదూరం వెళ్లి న తర్వాత వాహనాన్ని హ్యాండ్ బ్రేక్ వేసి రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్ కిందికి దిగాడు. కొద్ది క్షణాల తర్వాత ముందు సీట్లో కూర్చున్న ఓ చిన్న పాప హ్యాండ్‌బ్రేక్‌ను నొక్కడంతో వాహనం కదిలి రోడ్డు పక్కనే నీళ్లు ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది. సమీపంలో ఉన్న వారు వచ్చి వాహనాన్ని బయటకు తీసేలోగానే ఏడుగురు మృతిచెందారు. మిగిలిన నలుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వాహనం లోయలో పడిపోవడంతో డ్రైవర్ పరారీలో ఉన్నాడనీ, ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, క్షతగాత్రులకు సమీపంలోని ఓ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.