క్రైమ్/లీగల్

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఏప్రిల్ 22: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గృహిణి ఆమె ఇద్దరు పిల్లలతో ఆదివారం కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని గోదావరిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. బళ్ల సుధారాణి (28), ఆమెకు ఒక కుమార్తె నిహారిక (5), ఈశ్వరి మణికంఠ (4)తో కలిసి గోదావరిలో దిగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సుధారాణి మావయ్య సత్యనారాయణ తెలిపారు. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఆరేళ్ల క్రితం ఆయన కుమారుడు రాఘవేంద్రరావుకు దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన వరుసకు మేనకోడలైన దొంతంశెట్టి సుధారాణితో వివాహమైందని తెలిపారు. వివాహం అనంతరం రాజమహేంద్రవరంలోని అన్నపూర్ణమ్మ రైల్వేగేటు వద్ద కాపురముంటున్నారని, వారికి ఇద్దరు పిల్లలున్నారని చెప్పారు. అప్పుడప్పుడు చిన్నపాటి తగవులన్నప్పటికీ కలిసిమెలిసి ఉంటున్నారని తెలిపారు. గతంలో రెండుసార్లు సుధారాణి ఉత్తరం రాసి ఇంటినుండి వెళ్లిపోయి తిరిగి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిందన్నారు. అయితే మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో కొవ్వూరు పట్టణ పోలీసుల నుండి ఫోను రావడంతో తాము కొవ్వూరు గోష్పాదక్షేత్రానికి వెళ్లగా ఇరువురు చిన్నారుల మృతదేహాలను చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయామన్నారు. తన కుమారుడు రాఘవేంద్రరావు బట్టల షాపులో పనిచేస్తున్నాడని, చిన్నచిన్న సమస్యలు వచ్చినా సర్ది చెప్పేవారమన్నారు. సుధారాణి ‘మావయ్యా, నన్ను క్షమించు, నీకు అన్యాయం చేస్తున్నానని’ ఉత్తరం రాసిందని, అయితే ఇలా చేస్తుందని ఊహించలేదని విలపిస్తూ చెప్పారు. ఈ సంఘటనపై పట్టణ ఎస్సై పి రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.