క్రైమ్/లీగల్

మరో విద్యార్థి స్థానంలో పరీక్ష రాస్తూ పట్టుబడ్డ బాలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపురం, ఏప్రిల్ 22: మండల కేంద్రమైన సైదాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన వన్ సిట్టింగ్ ఇంటర్ పరీక్షలలో ఓ విద్యార్థినికి బదులుగా మరో బాలిక పరీక్ష రాస్తుండగా తనిఖీ అధికారులు గుర్తించారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటకు చెందిన మమత ఆదివారం సైదాపురంలో జరిగిన పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా ఆమె స్థానంలో ఆ బాలిక స్నేహితురాలు సాయితేజస్వీ అనే బాలిక పరీక్షకు హాజరైంది. పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన స్క్వాడ్ సిబ్బంది ఒక విద్యార్థినికి బదులుగా మరొకరు రాస్తుండటం గుర్తించి ఆ బాలికను స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.