క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, ఏప్రిల్ 22: ఆటో ట్రాక్టర్‌ను ఢీకొన్న సంఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయిన ఘటన పెనుగంచిప్రోలు-ముండ్లపాడు రహదారి మధ్యలో ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం ముండ్లపాడు గ్రామానికి చెందిన గొర్రిపాటి నిర్మల (57) తమ బంధువులు ఇద్దరితో కలిసి వత్సవాయి మండలం దేచినేనిపాలెం గ్రామానికి ఆటోలో తరలి వెళుతుండగా పెనుగంచిప్రోలు చెరువుకట్ట వద్ద ఎదురుగా వెళుతున్న కారును తప్పించబోయి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్మల అక్కడికక్కడే మృతి చెందగా పెసరమల్లి వాణి, పల్లెకంటి బుజ్జిలు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ ఐ అవినాష్ సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా జగ్గయ్యపేట తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.