క్రైమ్/లీగల్

వరంగల్‌లో రౌడీషీటర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 23: వరంగల్ నగరంలో రెండు రౌడీ గ్యాంగ్‌లు చెలరేగిపోయాయి. గత కొంత కాలం నుంచి రెండు గ్యాంగుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు పతాక స్థాయికి చేరుకుంది. అందులో భాగంగా వరంగల్ కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన సైతాల సాంబయ్య అనే చిన్న పాటి రౌడీషీటర్‌ను అదే ప్రాంతానికి చెందిన మరో రౌడీషీటర్ పత్రి కుమార్ మరో ఇద్దరితో కలిసి ఆదివారం తెల్లవారుఝామున హత్య చేసినట్లు సమాచారం. తల, మొండెం వేరు చేసి రెండు బస్తా సంచుల్లో ఒక దాంట్లో తల, మరో సంచిలో మొండెంపెట్టి కాశిబుగ్గ మేన్ సెంటర్‌లో తల, ఏనుమాముల మార్కెట్ సమీపంలో మొండాన్ని పడేసారు. ఇటీవల కాలంలో రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపగా తగ్గుముఖం పట్టాయి. తాజా సంఘటనతో తిరిగి ఆప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మృతుడు సాంబయ్యకు, పత్రి కుమార్‌కు మధ్య స్థానికంగా గత కొంతకాలం నుంచి ఆధిపత్యపోరు నడుస్తోంది. అందులో భాగంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ హత్య పాల్పడినట్లు భావిస్తున్న పత్రి కుమార్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్ ఏసీపీ రాయల ప్రభాకర్, సీఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలతో పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.