క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, ఏప్రిల్ 24: సత్తుపల్లి మండలం గంగారం బేతుపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12సంవత్సరాల బాలుడు మృతిచెందాడు. సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వైపు వెళుతున్న తల్లీకుమారుడు అఖీల్ రామస్వామి (12) బేతుపల్లి వద్ద పండ్లుకొనుగోలు చేసి రోడ్డుదాటుతుండగా అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అఖిల్‌రామస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రత్యక్షసాక్షులు చెప్పిన కథనం ప్రకారం లారీ అతివేగంగా వచ్చి రోడ్డుదాటుతున్న బాలుడిని డీకొట్టింది. బాలుడితండ్రి సూర్యనారాయణరావు అశ్వారావుపేట రెవెన్యూ కార్యాలయంలో విఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలుడు తల్లితోపాటు సత్తుపల్లి పట్టణం వచ్చి దుస్తులు కొనుగోలు చేసి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.