క్రైమ్/లీగల్

మద్యం మత్తులో వ్యక్తి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విస్సన్నపేట, ఏప్రిల్ 24: మద్యం మత్తులో తమ బంధువైన కడవకొల్లు శివకేశవులు (36) అనే వ్యక్తిని తల్లిబోయిన నాగరాజు హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి నర్సాపురం గ్రామసమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన తల్లిబోయిన నాగరాజు అతని స్నేహితుడైన కలవకొల్లు శివకేశవులు మద్యం సేవించేందుకు తమ గ్రామ సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కాలువ వద్దకు సోమవారం రాత్రి వెళ్ళారు. ఇద్దరు తీసుకెళ్ళిన బీరులను పూటుగా తాగారు. ఏమి జరిగిందో ఏమో నాగరాజు తన చేతిలో ఉన్న బీరు సీసాతో శివకేశవుల తలపై మోదగా శివకేశవులు అక్కడికక్కడే మృతి చెందాడు. శివకేశవులు మృతి చెందడంతో భయపడిన నాగరాజు విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌లో అప్పటికప్పుడే లొంగిపోయాడు. మంగళవారం ఉదయం నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు, తిరువూరు సీఐ సత్యనారాయణ, విస్సన్నపేట ఎస్ తులశీధర్‌లు వెళ్లి నేరస్థలాన్ని పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని భార్య, కుమార్తె, బంధువులు సంఘటనా స్థలికి వచ్చి రోదించడం చూపరులనసు కంటతడిపెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తులశీధర్ తెలిపారు.