క్రైమ్/లీగల్

ప్రేమ వ్యవహారం.. మందలింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 24: ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ పెద్దలు ఒప్పుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ప్రేమికుడు క్రిమీసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతుండగా, కాపాడే యత్నంలోప్రియురాలు అస్వస్థకు గురైన సంఘటన సోమవారం రాత్రి సిద్దిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లికి చెందిన సంతోష్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన రాణి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాణికి మూడేళ్ల క్రితం వివాహమైనా.. భర్త నచ్చకపోవడంతో కొన్ని రోజుల్లోనే విడాకులు తీసుకుంది. సంతోష్‌రెడ్డితోనే ప్రేమ వ్యవహారం నడుపుతుంది. సంతోష్‌రెడ్డి హైద్రాబాద్‌లో జాబ్ చేస్తుండగా రాణి సైతం హైద్రాబాద్‌లోనే కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో సంతోష్‌రెడ్డికి పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 29న వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇరు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకొని సంతోష పెళ్లి నిశ్చయమైనందున దూరంగా ఉండాలని సూచించారు. వారుమాత్రం తాము కలిసే ఉంటామని తెగేసి చెప్పడంతో మీ బతుకు మీరు బతకండని చెప్పారు. ఈ క్రమంలో వీరిద్దరు హైద్రాబాద్ నుంచి రాత్రి 11.30గం. ప్రాంతంలో సిద్దిపేటకు వచ్చారు. పెద్దల ఒత్తిడితో మనస్థాపానికి గురైన సంతోష్‌రెడ్డి కూల్‌డ్రింక్స్‌లో విషం కలుపుకొని సేవించాడు. నురుగు కక్కుతున్న విషయాన్ని గమనించిన ప్రియురాలు రాణి సంతోష్‌రెడ్డిని కాపాడేయత్నం చేసింది. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స చేస్తున్న క్రమంలో సంతోష్‌రెడ్డి మృతి చెందాడు. రాణి అస్వస్థతకు గురై చికిత్స పొందుతుంది. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.