క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, ఏప్రిల్ 25: మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నకిరేకల్ మండలం గొల్లగూడం గ్రామానికి చెందిన ముక్కమల్ల యల్లయ్య (55) అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలైయ్యాయి. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట నుండి నకిరేకల్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యల్లయ్యను వెనుక నుండి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కమే మృతిచెందాడని తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిందని ఆసమయంలో పోలీసులు సంఘటన స్థలంలోనే ఉన్నారని లారీ డ్రైవర్ వద్ద డబ్బులు తీసుకొని వాహనాన్ని వదిలివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు మృతదేహంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈవిషయంపై ఎఎస్సై కలీముల్లాఖాన్‌ను వివరణ కోరగా యల్లయ్యను ఢీకొట్టిన వాహనం గుర్తుతెలియదని టోల్‌ప్లాజాలోని సీసీపుటేజి ఆధారంగా వాహనాన్ని గుర్తిస్తామన్నారు. మృతుడిని భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య లక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.