క్రైమ్/లీగల్
పోలీసు స్టేషన్లో హత్యకేసు నిందితుడి ఆత్మహత్య!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 April 2018
అచ్యుతాపురం, ఏప్రిల్ 25: విశాఖపట్నం జిల్లా, అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో హత్యకేసు నిందితుడు పారిపల్లి రామునాయుడు(60) ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు స్థానిక ఎస్ఐ దీనబంధు బుధవారం తెలిపారు. అచ్యుతాపురం మండలంలోని చీమలాపల్లికి చెందిన రామునాయుడు స్టేషన్లో గల మరుగుదొడ్డిలో బుధవారం ఉరిపోసుకున్నాడు. వెదురువాడ గ్రామానికి చెందిన యువకుడు పెంట అప్పారావు హత్యకేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రామునాయుడిని పోలీసులు కేసు విచారణ నిమిత్తం మంగళవారం హత్యాస్థలానికి తీసుకువెళ్ళారు. దీంతో గ్రామస్తుల దగ్గర తన పరువు, మర్యాదలు మంటకలిసిపోయాయని భావించిన రామునాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని ఎస్సై చెప్పారు.