క్రైమ్/లీగల్

ఐదుగురు ఎర్రస్మగ్లర్లపై పీడీ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 25: కడప జిల్లా పోలీసులు ఐదుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించారు. అంతర్జాతీయ స్మగ్లర్లుగా పేరుపొందిన షేక్ ముస్త్ఫా, వేది అలియాస్ వేది శక్తివేలు, విశ్వనాధన్, కామేష్, ఏగూరి భాస్కర్‌పై పీడీ చట్టం ప్రయోగించారు. చెన్నైకి చెందిన షేక్ ముస్త్ఫా ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేసేవాడు. దుబాయ్‌లో ఉన్న అంతర్జాతీయ స్మగ్లర్ సాజితి ప్రధాన అనుచరుడు. సేలంకు చెందిన శక్తివేలు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు సేతుమాధవన్, ఆర్కాట్‌భాయ్, అనేకట్ బాబులకు నమ్మకస్తుడు. వేలూరుకు చెందిన విశ్వనాధన్‌కు అంతర్‌రాష్ట్ర స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. చెన్నైకి చెందిన కామేష్‌పై 19 కేసులు ఉన్నాయి. దుబాయ్‌లో ఉన్న అలీభాయ్‌కి కామేష్ ఎర్రచందనం సరఫరా చేసేవాడు. చిత్తూరు జిల్లాకు చెందిన భాస్కర్ పశ్చిమబెంగాల్‌కు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ప్రణబ్ కుమార్‌దేవ్ బర్మన్‌కు ప్రధాన అనుచరుడు.