క్రైమ్/లీగల్

నీటి తొట్టికూలి మహిళా కౌలు రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, ఏప్రిల్ 26: మానకొండూర్ మండల పరిధిలోని కొండపల్కల గ్రామంలో గురువారం ప్రమదవశత్తూ నీటి తొట్టికూలీ పింగిల్లి పద్మ(42) అనే మహిళా కౌలు రైతు మృతి చెందిన్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్కల గ్రామానికి చెందిన పింగిల్లి రవింధర్‌రెడ్డి పద్మ అనే ఇద్దరు భార్యా భర్తలకు భూమి లేక పోవడంతో ఇదే గ్రామాంలో ఏడు ఏకరాలను కౌలుకు తీసుకుని వరిపంటను సాగు చేసుకుంటున్నారు. పంటకుదోమపోటు రావడంతో పోలానికి మందు పిచికారిని భార్యా భర్తలు చేస్తున్నారు. బావివద్ద ఉన్న పెద్ద నీటితొట్టి నుండి నీటిని తీసుకుపోతుండగా ప్రమాదవశత్తూ నీటితోట్టి గోడ కూలీ పద్మపై పడడటంతో అమె అక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని బాధితకుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బాధితకుంటుబాన్ని సుడా చైర్మన్ జీవీఆర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జడ్పీటీసీ సుగుణాకర్, శేఖర్ పరామర్శించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళా కౌలు రైతు పద్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్ధికంగా అదుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ డిమాండ్ చేశారు.