క్రైమ్/లీగల్

హత్యాయత్నం కేసులో సంగం వీఆర్వోలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగం, ఏప్రిల్ 27:హత్యాయత్నం కేసులో సంగం మండలానికి చెందిన ఇద్దరు వీఅర్వోలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వేణు తెలిపిన వివరాల మేరకు ఉడ్‌హౌస్‌పేట గ్రామానికి చెందిన తిరుపతిరావు, సుష్మ ఇద్దరు దంపతులు. సుష్మ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. తరుణవాయి గ్రామానికి చెందిన వీఆర్వో రామక్రిష్ణారెడ్డికి సుష్మతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఈ విషయంపై భర్త చాలాసార్లు హెచ్చరించినా సుష్మ వినిపించుకోలేదు. ఈనేపథ్యంలో ఈ నెల 24వ తేదీన విధులు ముగించుకుని కారులో వెళ్తుండగా ఆమె భర్త చూసి కారును వెంబడించి మధ్యలో వారిని అడ్డుకున్నారు. దీంతో కట్టుకున్న భర్తనే హత్యచేయాల్సిందిగా ప్రియుడిని ఉసిగొల్పింది. రామక్రిష్ణారెడ్డి కారుతో ఢీకొట్టించగా తిరుపతిరావుకు తీవ్రగాయాలయ్యాయి. తిరుపతిరావు వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేసిన ఎస్సై వేణు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. వెంటనే కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.