క్రైమ్/లీగల్

24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడుగురాళ్ల, ఏప్రిల్ 27: చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించిన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... మిర్యాలగూడకు చెందిన మహాలక్ష్మి పిడుగురాళ్లలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వివాహ అనంతరం పట్టణంలోని తన తండ్రి ఇంటికి వెళ్లారు. ఆమె, ఆమె తండ్రి, తల్లి, సోదరి బయటి వరండాలో నిద్రిస్తుండగా మహాలక్ష్మి సోదరుడు గురుప్రసాద్ డాబాపై పడుకుని తెల్లవారే సరికి తన సోదరి బ్యాగ్‌లోని నాలుగు లక్షల విలువైన నగలతో ఉడాయించాడు. మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ వద్ద అతన్ని అరెస్ట్‌చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత చాకచక్యంగా 24 గంటల్లో కేసును ఛేదించిన సిఐ హనుమంతరావు, ఎస్‌ఐ రవీంద్రబాబు, సిబ్బందిని సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి అభినందించారు.