క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, ఏప్రిల్ 27: హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన సుంకేటి వెంకటి (40) అప్పుల బాధ భరించలేక గురువారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటయ్య తనకున్న మూడెకరాల వ్యవసాయంలో పంట సరిగా రాక అప్పుల బాదై ఏమీ తోచని పరిస్థితిలో గురువారం రాత్రి బావి వద్దకు వరికి నీరు పెట్టడానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య హలియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హుస్నాబాద్ ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.

40 లారీల ఇసుక నిల్వల స్వాధీనం
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 27: కొత్తపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని కమాన్‌పూర్, కొండాపూర్ గ్రామ శివారులో శుక్రవారం డ్రోన్ కెమెరాల సహయంతో 40 లారీల ఇసుక నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు. స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలను టీఎస్‌ఎండీసీ అధికారులకు అప్పగించి డబుల్ బెడ్ రూం, కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపైన భూముల్లో ఇసుక నిల్వలు చేసుకునే యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.