క్రైమ్/లీగల్

బావిలో దూకి యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, ఏప్రిల్ 27: మండలంలోని గోపాలరావుపేటలో శుక్రవారం ఉదయం రాసభక్తుల సుమలత (25) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్‌ఐ రవి కథనం ప్రకారం..మృతురాలి కుటుంబ పరిస్థితులు సరిగా లేవని, దీనికి తోడు తనకు వివాహం కాదేమోనని ఆందోళన చెందుతుండేదని, ఈ నేపథ్యంలో ఉదయం బాత్‌రూంకు వెళ్తానని చెప్పి అందరు చూస్తుండగానే సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు. కాగా, శవానికి పోస్టుమార్టం ముగిసిన అనంతరం శవాన్ని నేరుగా గ్రామంలోని నరేందర్ రెడ్డి ఇంటి ముందుకు తీసుకెళ్లడంతో గ్రామంలో గందరగోళం నెలకొంది. తన కూతురు మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. భూ వివాదంలో తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అనవసర రాద్ధాంతం చేస్తే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని వివరించారు. ఈ విషయంపై ఏదైనా ఉంటే దర్యాప్తు చేస్తామని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.