క్రైమ్/లీగల్

ఇద్దరు పిల్లలను చంపి, తండ్రి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఏప్రిల్ 27: గుంటూరుజిల్లా మంగళగిరి పట్టణ పరిధిలోని కుప్పురావు కాలనీకి చెందిన తిరువీధుల లక్ష్మీనారాయణ (40) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి చంపి తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేని లక్ష్మీనారాయణ పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పురావు కాలనీలో నివాసం ఉంటూ బంగారు వస్తువుల తయారీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీనారాయణకు 14 ఏళ్ల క్రితం శిరీషతో వివాహమైంది. గతనెల 12వ తేదీన శిరీషకు తడపర పోసి అదే సమయంలో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై మరణించింది. అప్పట్నుంచి మనోవ్యధ అనుభవిస్తున్న లక్ష్మీనారాయణ తాను ఎంతో ప్రేమించే భార్య దూరం కావడంతో జీవితంపై విరక్తిచెంది తన ఇద్దరు కుమారులు తేజేశ్వర్ (13), అమరేశ్వర్ (11)లకు విషం మింగించి వారు చనిపోయాక తాను కూడా విషం మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మరణించిన రోజునుంచి నిత్యం ఆమెను గుర్తు తెచ్చుకుంటూ బాధ పడుతుండే వాడని స్థానికులు చెబుతున్నారు. చనిపోయే ముందు లక్ష్మీనారాయణ అమెరికాలో ఉంటున్న తన బావకు, స్నేహితులకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపినట్లు అతని స్నేహితులు తెలిపారు. లక్ష్మీనారాయణ తన తల్లి, భార్యా బిడ్డలతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సమస్యలు గానీ, ఇబ్బందులు గానీ లేవని ఇరుగు పొరుగు వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ హరికృష్ణ తెలిపారు.

చిత్రం..మృతి చెందిన తండ్రి, ఇద్దరు పిల్లలు