క్రైమ్/లీగల్

లారీ, బైక్ ఢీ.. తండ్రీకొడుకుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, ఏప్రిల్ 28:మండల పరిధిలోని చెర్లోపల్లె గ్రామం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో తండ్రి, కుమారుడు దుర్మరణం చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. చెర్లోపల్లె గ్రామానికి చెందిన నంబి ఓబులేసు తన కుమారుడితో పాటు బంధువుల పిల్లలకు ఈత నేర్పించేందుకు అవుకు రిజర్వాయర్ వద్దకు వెళ్లాడు. అక్కడ పిల్లలకు ఈత నేర్పించిన అనంతరం స్వగ్రామమైన చెర్లోపల్లెకు ద్విచక్ర వాహనంపై తిరుగు పయణమయ్యారు. అయితే మార్గం మధ్యలో వీరి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో నంబి ఓబులేసు(42), జీవన్(7) అక్కడికక్కడే దుర్మరణం చెందగా బంధువుల పాపైన లిఖిత తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 వాహనం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన బాలికను బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాలను బనగానపల్లె ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా వీరిని ఢీ కొన్న లారీ మృతుల బంధువులదే కావడం గమనార్హం.