క్రైమ్/లీగల్

వివాహానికి వెళ్తూ... రోడ్డుప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్లంపేట, ఏప్రిల్ 29: తెల్లవారితే వారి కూతురికి పెళ్లి. కూతురి పెళ్లి అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేసుకుని ఎంతో ఆనందంగా ఆ కుటుంబం అనంతపురం జిల్లా కొత్త గుంతకల్ యాడికి దగ్గర వెంకటాపురానికి చెందిన శివ తమ కుటుంబ సభ్యులతో ఎపి04 టిటి 9266 తుఫాన్ వాహనంలో తమ కూతురు ఉషారాణికి తిరుపతిలో జరిగే వివాహానికి బయలుదేరారు. అయితే విధి వారిపట్ల చిన్నచూపు చూడడంతో ఆర్‌జె 329 బి 9419 అనే లారీ రూపంలో మృత్యువు వెంటాడి కడప జిల్లా పుల్లంపేట మండలం ప్రకాష్‌నగర్ కాలనీవద్ద రోడ్డుప్రమాదంలో ఏడుగురిని కబలించగా మరో నలుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. తెల్లారితే తిరుపతిలోని రిగాలియా హోటల్‌లో వివాహానికి వెళ్తుండగా పుల్లంపేట ప్రకాష్‌నగర్ వద్దకు రాగానే చెన్నై నుండి డిస్‌పూర్ వెళ్తున్న లారీడ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా తుఫాన్ వాహనాన్ని ఢీ కొనడంతో వాహనం పూర్తిగా దెబ్బతిని అందులో ప్రయాణిస్తున్న శివ, ప్రసాద్, సరస్వతి, సుజాత, భాగ్యలక్ష్మి, గాయత్రి, రంగమ్మలు మృతి చెందారు. వెంటనే రాజంపేట డిఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రవికుమార్, నందలూరు ఎస్సై ప్రతాప్‌రెడ్డి, కోడూరు ఎస్సై భక్తవత్సలం, పెనగలూరు ఎస్సై శివప్రసాద్, పుల్లంపేట ఎస్సై చెన్నకేశవులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీని పిలిపించి వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టంపై బయటకుతీసి తీవ్రంగా గాయపడ్డ శివన్న, మనోహరి, సాయి, రాజులను కడప రిమ్స్‌కు వైద్యచికిత్స కోసం తరలించారు. సుమారు గంటపాటు ట్రాఫిక్ అంతరాయం కాగా పుల్లంపేట పోలీసులు డెమె క్యారియర్ పోలీసులు సుబ్బరాయుడు తదితరులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ పేర్కొన్నారు.