క్రైమ్/లీగల్

ట్రాక్టరు బోల్తా: వ్యక్తి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, ఏప్రిల్ 29: అప్పటివరకు మనువళ్ళు, మనవరాళ్ళతో సరదాగా కాసేపు గడిపి తన జీవన గమనంలో ట్రాక్టరు నడిపేందుకు బయటకు వెళ్ళిన వ్యక్తి కొద్ది సేపటికే విగతజీవుడుగా మారాడు. భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యకు భర్త ఇకలేడు అన్న నిజంతో తలడిల్లిపోయింది. ముసునూరు ఎస్సీ కాలనీకి చెందిన కోరు విజయకుమార్ (45) ట్రాక్టరు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం స్థానిక నగరాల చెరువు నుండి మట్టిని తరలించే క్రమంలో క్వారీ నుండి బయటకు వచ్చిన ట్రాక్టరు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వంతెనకు ఢీకొనడంతో ట్రాక్టరు ఇంజను పల్టీ కొట్టంది. ఈ సంఘటనలో డ్రైవరు విజయకుమార్ ఇంజనులో ఇరుక్కుపోయాడు. ఛాతి భాగాన్ని ఇంజను నొక్కివేయడంతో స్థానికులు అది చూసి విజయకుమార్‌ను బయటకు లాగి నూజివీడు అమెరికన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విజయకుమార్ మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటన స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.