క్రైమ్/లీగల్

పెనుకొండ సబ్‌జైలు నుంచి ఖైదీ పరారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఏప్రిల్ 30 : పట్టణంలోని సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఆదివారం పరారయ్యాడు. చిలమత్తూరు మండలం కంబాలపల్లికి చెందిన వడ్డె వెంకటేశులు గతనెల 1న రిమాండ్ ఖైదీగా సబ్‌జైలుకు వచ్చినట్లు జిల్లా జైళ్ల సూపరింటెండెంట్ సుదర్శన్‌రావు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆయన సోమవారం స్థానిక సబ్‌జైలును సందర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ముద్దాయి గోరంట్ల పోలీసుస్టేషన్ పరిధిలో రెండు నెలల క్రితం మూడు ఎటీఎంల చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో బయటకు వదలగా వార్డెన్ల కళ్లుగప్పి పరారైనట్లు తెలిపారు. దీంతో అప్పుడు విధుల్లో ఉన్న వార్డర్లు రాము నాయక్, జయరాంను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ముద్దాయి పరారీపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. ఈ విషయమై పోలీసులకు సైతం సమాచారం అందించామని, పోలీసు సిబ్బంది పరారీలో ఉన్న ఖైదీని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.