క్రైమ్/లీగల్

వివాహ వేడుకల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, ఏప్రిల్ 30: వివాహ వేడుకల్లో విద్యుదాఘాతానికి ఒకరు మృతిచెందగా మరో ఐదుగురికి గాయాలై వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషాద సంఘటన సోమవారం రేగులవరం తండాలో చోటు చేసుకుంది. వివరాలలోకెళ్తే... వడితె సాయికుమార్ వివాహం సందర్భంగా పెళ్లికుమారుడైన సాయికుమార్‌కు నలుగుపెట్టే సమయంలో పాటపాడేందుకు అదే గ్రామానికి చెందిన వడితె సునీత (16)ను తీసుకొచ్చారు. ఆమె పాటపాడేందుకు వౌత్ స్పీకర్ పట్టుకోగా వౌత్ స్పీకర్‌కు విద్యుత్ సరఫరా జరగటంతో సునీత షాక్‌కు గురైంది. ఈమెను కాపాడేందుకు సబావత్ హంస, వడితె లక్ష్మీ, వడితె జమిలి, బాయి, సక్రులు ప్రయత్నించగా అప్పటికే సునీత మృతిచెందింది. షాక్‌కు గురైన హంస, జమిలి, లక్ష్మీ, బాయి, సక్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన మాచర్లలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు విజయపురిసౌత్ ఎస్సై సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.