క్రైమ్/లీగల్

భర్త చేతిలో భార్య హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, మే 15: స్థానిక విష్ణుకుండినగర్‌లో నివసిస్తున్న వివాహిత తోట రమాదేవి (45) సోమవారం రా త్రి భర్త తోట వెంకట సాంబశివరావు చేతిలో హత్యకు గురైంది. ఏలూరుకు చెందిన ఈ దంపతులు ఇటీవల వినుకొండకు వచ్చి ఎంపీ రాయపాటి పోలాల్లో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నా డు. ఇటీవల అనారోగ్యంతో అతన్ని ఉద్యోగం నుండి తొలిగించారు. దీం తో ఆర్థిక ఇబ్బందులు, కు టుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ దంపతులకు ఒక్క కుమార్తె అమెరికాలో ఉంటుంది. భర్త అ నారోగ్యంపాలు కావడం తో రమాదేవి 15 రోజుల కిందట అమెరికా నుండి తిరిగి వచ్చింది. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. నిద్రిస్తున్న భార్య రమాదేవిని పక్కనే ఉన్న పొత్రం రాయితో తలపై మోదడంతో నిద్రలోనే తలపగిలి మృతిచెందింది. పోలీసులు మృతదేహాన్ని వినుకొండ మార్చురీకి తరలించారు. మంగళవారం సాయంత్రం శవపరీక్ష చేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. భర్త సాంబశివరావు పోలీసులకు సమాచారం ఇచ్చి, లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.