క్రైమ్/లీగల్

పట్టుబడ్డ క్రికెట్ బెట్టింగ్ ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు టాస్క్ఫోర్స్ అధికారులకు చిక్కారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బేగంబజార్‌కు చెందిన మనోజ్ బత్తి, రాధాశ్యామ్ రాఠి, వినిత్ మంత్రి, సిటీ కాలేజీ సమీపంలోని ఆనంద్ గల్లీకి చెందిన జే.అరుణ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు. వీరి నుంచి రూ.84350 నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ముంబయి ఇండియన్ వెర్సస్ కింగ్స్ ఎలివెన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్‌పై బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ దాడి చేసినట్లు తెలిపారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదును షాహినాయత్ గంజ్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లకు తదుపరి దర్యాప్తు నిమిత్తం అప్పగించినట్లు వెల్లడించారు.