క్రైమ్/లీగల్

పట్టుబడ్డ క్రికెట్ బెట్టింగ్ ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 20: రామంతాపూర్ ఆనంద్‌నగర్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులతో కూడిన ఓ ముఠాను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌చేసి రూ.70 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ వర్సెస్ ముంబయ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ఇమ్రాన్ (29), టీ.వెంకటేశ్ (28), మహ్మద్ అశ్రఫ్ (25), ఎండీ ఫయూమ్ (28), సయ్యద్ జావిద్ (24)ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
మారెమ్మ దేవాలయంలో చోరీ
బొంరాస్‌పేట, మే 20: గిరిజనుల ఆరాధ్య దైవం మారెమ్మ దేవాలయంలో శనివారం రాత్రి దొంగలు పడి నాలుగు తులాల బంగారం దోచుకున్నారు. తెల్లవారుఝామున ఆలయంలో శుద్ధి చేయడానికి వెళ్లిన వారు చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బొంరాస్‌పేట ఎస్‌ఐ సెలవుపై వెళ్లడంతో కొడంగల్ ఎస్‌ఐ సతీష్.. మారెమ్మ దేవాలయానికి వెళ్లి విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి దుండగులను పట్టుకుంటామని తెలిపారు.